బి.ఆర్.కె మెగా క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు అందచేసిన “బత్తుల”

రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతుల ఆర్థిక సహాయంతో బి.ఆర్.కె మెగా క్రికెట్ టోర్నీని నిడిగట్ల గ్రామంలో జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రెటరీ మేడిశెట్టి శివరాం పర్యవేక్షణలో నియోజకవర్గ స్థాయి టోర్నీలో 40 టీంలు పాల్గొన్నాయి. ఈ టోర్నీ సుమారు 20 రోజుల పాటు నిడిగట్ల గ్రామంలో సుదీర్ఘఒగా జరిగి ఆదివారం జరిగిన ఫైనల్స్ లో ప్రతిభ కనబరిచి గెలుపొందిన మొదటి టీముకి 44వేల444రూపాయలు, ట్రోఫీ, అలాగే రన్నర్ గా నిలిచిన టీంకి ద్వితీయ బహుమతి 22వేల 222 రూపాయలు, 3వ విజేతగా నిలిచిన టీమ్ కి తృతీయ బహుమతి 5వేల 555 రూపాయలు గెలుచుకున్న టీములకు అందించడం జరిగింది. ఈ క్రీడల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ మెడల్స్ వేసి క్రీడా స్ఫూర్తికి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా బలరామకృష్ణ మాట్లాడుతూ యువత చెడు సావాసాలకు తావులేకుండా క్రీడలపట్ల దృష్టిపెట్టి క్రీడా నైపుణ్యాన్ని పెంచుకొని, క్రీడల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.