మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బత్తుల

  • ఉపాధి కూలీ మృతురాలి కుటుంబానికి మనోధైర్యం చెప్పి, బాసటగా ఉంటామని భరోసా ఇచ్చి, 10,000/- (పదివేల రూపాయలు) ఆర్థిక సహాయం అందించిన బత్తుల

రాజానగరం మండలం, కలవచర్ల గ్రామానికి చెందిన మడకా వెంకటలక్ష్మీ కొద్ది రోజుల క్రితం ఉపాధి హామీ పనికి వెళ్లి, పని చేస్తూ గుండెపోటుతో మరణించగా.. విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి, మనోధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. కుటుంబ ఖర్చుల నిమిత్తం ₹ 10,000/- (పదివేల రూపాయలు) ఆర్థిక సహాయం అందించి.. రాబోవు రోజుల్లో కుటుంబానికి జనసేన పార్టీ తరఫున అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు, కార్యక్రమంలో సీనియర్ జనసేన నేతలు, కలవచర్ల గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.