లంకూరు మెగా క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించిన బత్తుల

రాజానగరం: సీతానగరంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన లంకూరు మెగా క్రికెట్ టోర్నమెంట్, మట్టా శివాజీ మెమోరియల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టోర్నమెంట్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి పోటీలను జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్బంగా స్కర్గీయ మట్టా శివాజీ చిత్రపటానికి బత్తుల పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు యర్రంశెట్టి శ్రీను, అక్కిరెడ్డి వేణు, మట్టా వెంకటేశ్వరరావు, ఇతర నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.