కుటుంబ సభ్యులను కోల్పోయిన పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం మండలం, భూపాలపట్నం గ్రామ వాస్తవ్యులు అరిసేపు గొర్రజు ఇటీవల స్వర్గస్తులు కాగ.. సర్పంచ్ గుల్లింకల లోవరాజు విషయం తెలియజేయగా… రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబ సభ్యులను పలకరించి, మనోధైర్యం చెప్పడం జరిగింది..

అదేవిదంగా కోరుకొండ మండలం, పశ్చిమగానుగూడెం గ్రామవాసి మామిళ్ళ దుర్గాప్రసాద్ అనారోగ్యంతో కొద్దిరోజుల క్రితం మృతి చెందగా విషయం తెలుసుకున్న… రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మీ వారి కుటుంబ సభ్యులును పరామర్శించి, జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా వచ్చి వారి ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా కుటుంబ ఖర్చుల నిమిత్తం 5,000/- రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు మెండి విష్ణు, బదిరెడ్డి దొర, వీరపురాజు పోసుబాబు, రాచపోతుల సురేష్, గోడల సాయి, గోజంకి రాజు, కండవల్లి వీరబాబు, మద్దిరెడ్డి బాబులు, వేగిశెట్టి రాజు, అల్ల వెంకనబాబు, తోట అనిల్ వాసు, నాతిపాం దొరబాబు పంతం శ్రీనివాసు గ్రామపెద్దలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.