రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడిని పరామర్శించిన బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం మండలం, యర్రంపాలెం గ్రామ వాస్తవ్యులు రావూరి వీరన్న కాపు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడగా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పరామర్శించి, యోగక్షేమాలు తెలుసుకొని డాక్టర్లు సూచించిన విధంగా త్వరగా కోలుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు తోరాటి శ్రీను, మద్దిరెడ్డి బాబులు, తోట అనిల్ వాసు, దేవన దుర్గాప్రసాద్, అడ్డాల దొరబాబు, దొడ్డా బాలకృష్ణ, పుణ్యక్షేత్రం, జనసేన యూత్, యర్రంపాలెం జనసేన, సీనియర్ నేతలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.