రాజానగరం నియోజకవర్గంలో బత్తుల వెంకటలక్ష్మి సుడిగాలి పర్యటన

  • పరిమళించిన దాతృత్వం.. పదిమందికి సహాయం చేస్తూ, సేవామార్గంలో తన ఆనందాన్ని వెతుక్కునే సేవాతత్పరులు బత్తుల దంపతులు..

రాజానగరం నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టమొచ్చినా.. అది తెలియగానే ముందు నిలబడి సహాయం చేయడానికి సంసిద్ధం వ్యక్తం చేస్తూ… అహర్నిశలు క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న “నా సేన కోసం నా వంతు “కమిటీ కో’ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ… పలువురి బాధితులను పరామర్శించి, కొందరికి ఆర్థిక సహాయం అందించిన వివరాలు.. సీతానగరం మండలం, ఇనుగంటివారిపేట గ్రామంలో బట్టు మేసియ్య అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని విషయం తెలియగానే.. వారిని పరామర్శించి, వారి ఆరోగ్య సమాచారం తెలుసుకుని, వైద్య ఖర్చులు నిమిత్తం 5,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.. సీతానగరం మండలం, ఇనుగంటివారిపేట గ్రామానికి చెందిన బట్టు ఏసుబాబు యాక్సిడెంట్ గురికాగా.. వారిని పరామర్శించి కోరుకుంటున్న తీరు తెలుసుకుని, వైద్యఖర్చుల నిమిత్తం 5,000/- రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. కోరుకొండ మండలం, కణుపూరు గ్రామానికి చెందిన నాయకులు గల్లా ఖేదర ఈశ్వరుడు గారు కరెంట్ షాక్కు గురికాగ, వారిని పరామర్శించి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకొని 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. కోరుకొండ మండలం, దోసకాయలపల్లి గళ్ళ వెంకన్న అనుకోని పరిస్థితుల్లో కోడికత్తి గుచ్చుకోవడంతో వారిని పరామర్శించి, కోరుకుంటున్న విధానం గురుంచి తెలుసుకుని 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. కోరుకొండ మండలం, దోసకాయలపల్లి గ్రామానికి చెందిన బత్తిన ముఖేష్ రోడ్డు ప్రమాదంలో గాయాలు కాగ, వారిని పరామర్శించి యోగక్షేమలు తెలుసుకొని, కుటుంబ ఖర్చుల నిమిత్తము 5,000/- ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామవాసి ఆడారి శీను పాము కాటుకు గురై రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా వారిని పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు సూచించడం జరిగింది, ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాలకు చెందిన స్థానిక జనసేన నాయకులు, జనసైనికులుశ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వెంట పాల్గొన్నారు.