Srikakulam: విద్యార్ధులకు బాసటగా భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్

శ్రీకాకుళం జిల్లా, అదపాక, అల్లినగరం, బుడుమురు జంక్షన్ లో పల్లెవెలుగు బస్సులు ఆపడం లేదని కొంత మంది స్టూడెంట్స్ కాకర్ల బాబాజీకి తెలియజేయడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీ పంచకర్ల సందీప్ స్పూర్తి తో వినీల్ విశ్వంభరదత్ ప్రతిపాదనతో శుక్రవారం ఋట్ఛ్ డిపో CI శ్రీ రమేష్ కి లేఖ ద్వారా శ్రీకాకుళం జిల్లా భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ సభ్యుడు కాకర్ల బాబాజీ వివరించడం జరిగింది. అలాగే స్పెషల్ బస్సులు విధ్యార్థుల కొరకు వేయించాలని కోరడం జరిగింది. శ్రీ CI రమేష్ మాట్లాడుతూ పల్లె వెలుగు RTC డ్రైవర్ తో మాట్లాడి తప్పకుండా ఆయా జంక్షన్ లో స్టాప్ చేయమని చెపుతానని చెప్పడం జరిగింది. ఏ పల్లె వెలుగు బస్సు అయినా ఆపకపోతే నాకు మెసేజ్ ద్వారా తెలియజేయండని చెప్పడం జరిగింది. స్పెషల్ బస్సు గురించి నేను అధికారులతో మాట్లాడుతానని చెప్పడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా భగత్ సింగ్ యూనియన్ సభ్యులు అందరూ కలిసి “డిపో CI శ్రీ రమేష్” కి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో 8 మంది భగత్ సింగ్ సభ్యులు పాల్గొన్నారు.