Pithapuram: మత్స్యకారులకు అండగా మాకినీడి శేషుకుమారి

మత్స్యకారుల కోసం అధికారులు స్పందించే వరకు న్యాయపోరాటం

తూర్పుగోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ పర్యటనలో భాగంగా పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి మత్స్యకార సోదరుల గ్రామాలకు వెళ్లి కోతకు గురవుతున్న ఇళ్లు, వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న ప్రజలు పడుతున్న ఇబ్బందులను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళతానని తెలియజేసారు. జనసేన పార్టీ ఎప్పుడు ప్రజల కష్టాలలో అండగా ఉంటుందని జనసేన పార్టీ సిద్ధాంతాలు వారికి తెలియజేశారు. త్వరలోనే మీ సమస్యలపై పూర్తి వివరాలు సేకరించి మీకు న్యాయం జరిగే విధంగా జనసేన పార్టీ పోరాడుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి చీకట్ల శ్యామ్ కుమార్, వంకా కొండబాబు, సూరాడా శ్రీను, మేరుగు ఇశ్రయేలు, మైలపల్లి దావీదు, మైలపల్లి జగన్నాధం, బడే మసేను, వంకా జాన్, రాసిపిల్లి నాగేశ్వరరావు, కొవ్విరి రాజారావు, చింతకాయల జగన్నాథం, కంబాల గోవిందు, మోస ఎల్లాజీ, ఉమ్మిడి ఫిలిప్, సోదే రాము, కొనడా సింహాద్రి, గంటా మహేష్, సోదే సత్తిబాబు, కోడా బాలు, రాచపల్లి శివ, సోదే శ్రీను, దుర్గాప్రసాద్, సూరాడ ప్రతాప్, అంజి, శివ, అజయ్, మణికంఠ, రాజు, హేమ, రవి నాని జనసేన నాయకులు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.