మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్న భవానీ రవికుమార్

జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి. భవానీ రవికుమార్ మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు.

యాక్సిడెంటులో కాలు కోల్పోయిన వ్యక్తికి రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ పరుచూరి భవానీ రవికుమార్ ఆర్థికసాయం.

ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామానికి చెందిన దాసరి అనీల్ అనే వ్యక్తి 5 నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయాడు.

కనీసం సొంత ఇల్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబ వివరాలు స్థానిక జనసేన పార్టీ కార్యకర్త అజయ్, సత్యల ద్వారా విషయాన్ని తెలుసుకున్న భవానీ రవికుమార్ ఆమిద్యలా గ్రామంలో ఉరవకొండ జనసైనికులతో కలసి బాధితున్ని పరామర్శించి తక్షణ ఖర్చుల నిమిత్తం 10 వేల రూపాయలను వారికి ఇచ్చి, ప్రతి నెలా 10 వేల రూపాయలు అలా సంవత్సరం పాటూ అందిస్తామని హామి ఇచ్చారు. అలాగే ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధిత కుటుంబానికి చాలా రోజులుగా నిత్యావసర సరుకులను అందిస్తున్నారు. జనసేన పార్టీకి, జనసైనికులకు అండగా ఉంటామని వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీ రాపా ధనుంజయ్, హుస్సేన్, కాలేషా మరీయూ ఉరవకొండ జనసైనికులు పాల్గొన్నారు.