భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ప్రజల హృదయాల్లో సుఖసంతోషాలు నింపాలి: ఎన్ఆర్ఐ రాయుడు వెంకటేశ్వరరావు

తూర్పుగోదావరి జిల్లా, ఆలమూరు మండలంలోని, చెముడులంక గ్రామానికి చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ రాయుడు వెంకటేశ్వరరావు బెహరిన్ గల్ఫ్ దేశం నుంచి మాట్లాడుతూ, మన తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషాలతో జరుపుకునే ఈ సంక్రాంతి పండుగకు, ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. గత సంవత్సరం, అదే విధంగా ఈ సంవత్సరం కూడా కరోనా కష్టకాలంలోనే ఇంకా ఉన్నాం. కొన్ని కుటుంబాల్లో చాలా విషాదకరమైన సంఘటన జరిగాయి. కొంతమంది కరోనాతో కుటుంబ పెద్దలు చనిపోవడం మూలంగా, కొంతమంది జీవితాలు అంధకారం అయ్యాయి. గత రెండు సంవత్సరాలుగా ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ దినదినగండంగా గడుపుతున్నారు. అయినా కూడా ఇంకా జాగ్రత్తగానే ఉండాలని కోరుకుంటున్నాము. సాటివారికి ఆపదలోను, కష్టంలోనూ సహాయంగా నిలబడి, మేము ఉన్నామని సహాయం చేస్తూ, ధైర్యం చెబుతూ అండగా ఉండాలని సాటివారికి ఆపదలనుఒచి గట్టెక్కించే విధంగా సహాయం, సహకారాలు చేయాలని కోరుచున్నాము. ఈ సంక్రాంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అని, చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని, మరొకసారి తెలియజేయుచున్నాను.