వాక్సిన్ పంపిణీపై బైడెన్ ప్రభుత్వం కీలక ప్రకటన

అమెరికాలో వాక్సిన్ పంపిణీ వేగవంతం చేయడానికి బైడెన్ ప్రభుత్వం మరో 20 కోట్ల డోసులు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని శ్వేతసౌధం మంగళవారం ప్రకటించింది. వేసవి నాటికి 30 కోట్ల జనాభాకు సరిపడా డోసులు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేసింది. ఇప్పటికే 40 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.

“ఫైజర్​, మోడెర్నాల నుంచి చెరో పది కోట్ల డోసులను కొనుగోలు చేసేందుకు బైడెన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నిర్ణయంతో వ్యాక్సిన్ కొనుగోలు 50 శాతం పెరిగింది. వారానికి అదనంగా 14 లక్షల డోసులు అందుబాటులోకి రానున్నాయి. మరో మూడు వారాల వరకు ఇదే స్థాయిలో పంపిణీ చేసేందుకు కట్టుబడి ఉన్నాం.” అని తెలిపింది.