పెద్దమనసు చాటుకున్న జనసేన నాయకులు

  • పశువుల మృత్యువాత బాధితులకు జనసేన సహాయం
  • ఇబ్బందుల్లో ఉన్నవారికి జనసేన ఎప్పుడూ తోడుగా ఉంటుంది

ద్వారకాతిరుమల మండలం, గుండుగోలను కుంట గ్రామంలో పశువుల మృత్యువాత బాధితులకు జనసేన పార్టీ నాయకులు సహాయం అందించారు. ద్వారకాతిరుమల మండలం గుండుగోలనుకుంట గ్రామంలో గత రెండు రోజుల క్రితం ఉజ్జు రాజు, మంగమ్మ దంపతులు జీవనాధారమైన పశువుల పాలు అమ్మే జీవన వృద్ధి అయినటువంటి 5 గేదెలు, 1 ఆవు యూరియా కలిపిన నీటిని తాగడం వలన దురదృష్ట సంఘటన పశువులు చనిపోవడం బాధాకరం. ఉజ్జు రాజు మంగమ్మ కుటుంబాన్ని పరామర్శించి. గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు గారు మండల పార్టీ ప్రెసిడెంట్ దాకారపు నరసింహమూర్తి ఆధ్వర్యంలో ద్వారకాతిరుమల గుండుగొలనుకుంట గ్రామ పార్టీ నాయకులతో జనసేన పార్టీ తరఫున 20వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. నియోజకవర్గ ఇన్చార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు మాట్లాడుతూ ఇబ్బందుల్లో ఉన్నవారికి జనసేన పార్టీ ఎప్పుడూ తోడుగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గం ఇన్చార్జి దొడ్డిగర్ల సువర్ణ రాజు గారు, ద్వారకాతిరుమల మండలం అధ్యక్షులు దాకారపు నరసింహమూర్తి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు తరగళ్ళ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చిలకూరి ఫ, ద్వారకాతిరుమల టౌన్ ప్రెసిడెంట్ కోట ఆంజనీ కుమార్, గుండుగొలనుకుంట పార్టీ ప్రెసిడెంట్ అద్దంకి శేఖర్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.