రాజానగరంలో వైసీపీకి బిగ్ షాక్
- జనసేన పార్టీలో చేరిన పలువురు దళిత సీనియర్ నాయకులు
రాజానగరంలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధంతాలు నచ్చి అలానే రాజానగరం నియోజవర్గ నాయకులు బత్తుల బలరామకృష్ణ సమర్థమమైన నాయకత్వంపై నమ్మకం అలానే రాజానగరం నియోజకవర్గంలో అవినీతి, అరాచకం, రౌడీయిజం పెరిగిపోవడం. పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని దళితులపై పలు దాడులు జరగడం వల్ల విసుగు చెంది సీతానగరం మండలం, సీతానగరం గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన ఎస్సి సామాజికవర్గానికి చెందిన బలమైన సీనియర్ నాయకులు మద్దాల ఏసుపాదం వారి కుమారుడు జీవన్ బాబు వారి అనుచరగణం, అలానే మాజీ ఎంపిటిసి చీకట్ల వీర్రాజు వారి అనుచరులు, రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, వారి సతీమణి శ్రీమతి వెంకటలక్ష్మిల సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి బత్తుల దంపతులు జనసేన కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మట్ట వెంకటేశ్వరరావు, బండి సత్యప్రసాద్, కాండ్రేకుల పోసిరత్నం, కొండాటి సత్యనారాయణ, మాధవరపు వీరభద్రరావు, అడపా నరసింహం, ప్రగడ శ్రీహరి, రుద్రం నాగు, గోకాడ సూర్యవతి, వెల్లంపేట శ్రీను, స్వామి, బంగారం, సూరిబాబు, రుద్రం కిషోర్, కరుణాకర్, రుద్రం గణేష్, మిర్తుపాడు ప్రసాదు, కిలాడి వీరయ్య, పెరుగు బాబి, చీరల శివ నాగేంద్ర, బ్రహ్మం, ఎనగంటి వారి పేట పిండి వివేక్, తన్నీరు నాగేంద్ర, కండవల్లి వీరబాబు, బొడ్డపాటి నాగేశ్వరరావు, బొంగా స్టాలిన్, రాయి చిట్టిబాబు, రాజనగరం కోరుకొండ మండల నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-11-at-16.40.31-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-11-at-16.40.36-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-11-at-16.40.35-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-11-at-16.40.33-1024x576.jpeg)