క్యాన్సర్ బాధతో మరణించిన కుటుంబానికి జనసేన పరామర్శ

*నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా, మండల ప్రెసిడెంట్ అల్లం రామకృష్ణ తదితరులు.

అల్లూరి సీతారామరాజు జిల్లా.. అరకు నియోజకవర్గం, బొండం పంచాయతీ పరిధిలో గల కొత్తవలస గ్రామంలో శుక్రవారం సాయంత్రం జనసేన పార్టీ నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా, అల్లంగి రామకృష్ణ, గతుం లక్ష్మణరావు, ప్రకాష్ తదితరుల ఆధ్వర్యంలో.. ఆయా గ్రామంలో పర్యటించి ముందుగా క్యాన్సర్ వ్యాధితో మరణించిన గతుం భీమన్న ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగినది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా, మండల అధ్యక్షులు అల్లంగి రామకృష్ణ, కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. అధైర్య పడవద్దని ధైర్యంగా నిలబడాలని మీకంటూ జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం ఆయా గ్రామంలో ఇంటింటికి జనసేన మాటలు జనసేన సిద్ధాంతాలు విధివిధానాలు జనాల దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.