రాజోలులో వైసిపికి భారీ షాక్..!
రాజోలు నియోజకవర్గంలో వై.ఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తులు, రాజోలు నియోజకవర్గం నుండి వైసిపికి రెండుసార్లు ప్రాతినిద్యం వహించి మరియు వైసిపి ఆవిర్భావం నుండి పార్టీలో, పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషిచేసినటువంటి రాజోలు నియోజకవర్గ వైసిపి నాయకులు బొంతు రాజేశ్వరరావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆదివారం హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కలయిక ద్వారా బొంతు త్వరలో జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారా అంటే అవునన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇప్పటికే జనసేనకు కంచుకోటగా ఉన్న రాజోలులో మళ్ళీ జనసేన విజయాన్ని ఎవరూ ఆపలేరని అంటున్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-11-at-22.27.14-1024x766.jpeg)