ఏకలవ్య పాఠశాలల్లో ఆదివాసీ అభ్యర్థులతోనే గెస్ట్ టీచర్ పోస్ట్ లు భర్తీకి చర్యలు తీసుకోవాలి

  • జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు డిమాండ్

అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 ఏకలవ్య పాఠశాలల్లో గెస్ట్ టీచర్ పోస్టులు ఆదివాసీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భముగా జనసేనపార్టీ ఆరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతంలో శత శాతం ఉద్యోగాలను అధివాసులకే కేటాయించాలి, తప్పుడు ధ్రువ పత్రాలు పొందిన బోగస్ ఎస్టీలను గ్రామ సభల ద్వారా గుర్తించి అలాంటి వారిపై సమగ్ర విచారణ జరిపి సర్టిఫికెట్ లు రద్దు చేయాలి. జీఓ నంబరు 3 రద్దు నేపథ్యంలో ఆదివాసీ ఉద్యోగాల నియామక చట్టం తీసుకొచ్చేందుకు కృషి చేయాలి ఆదివాసీ ప్రాంతంలో గిరిజనేతరులకు ఇళ్ల పట్టాల కేటాయింపును ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారు. వెంటనే ఆదివాసులకు అన్నివిధాల ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలి ఆదివాసీ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి, ఏకలవ్య పాఠశాలల్లో గిరిజన అభ్యర్థులతోనే గెస్ట్ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని మాదాల శ్రీరాములు డిమాండ్ చేశారు.