పెద్దపల్లి జిల్లాలో బర్డ్ ఫ్లూ?

పెద్దపల్లి: జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాల్వ శ్రీరాంపూర్‌లో నాలుగు వేల నాటు కోళ్లు అకస్మత్తుగా మృతి చెందడం జిల్లాలో కలకలం సృష్టించింది. బర్డ్ ఫ్లూ సోకిన కారణంగానే కోళ్లు చనిపోయినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఉదయం పూట దాణా తిన్న తర్వాత రెండు గంటల్లోనే నాలుగు వేల కోళ్లు మృతి చెందాయి. ఎండల వేడా, లేక మరేదైనా కారణంతో చనిపోయాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కోళ్ల మీద విష ప్రయోగం జరిగిందేమో అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది.