పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలలో భాగంగా రక్తదాన శిబిరం

ఇచ్చాపురం, తిప్పన దుర్యోధన రెడ్డి నాయకత్వంలో పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా రామ్ చరణ్ టీం ఒడిసా ఇచ్చాపురం ఎల్-మ్యాక్స్ థియేటర్ లో పలాస ప్రాణదాత బ్లడ్ బ్యాంక్ సాయంతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి 40 మెంబెర్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్స్గ గౌరీ శంకర్, పూర్ణ రెడ్డి, కె నగేష్, వేణు, వడబార్ వ్యవహరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ మరియు రక్తదాన వీరులు పాల్గొన్నారు. తిప్పన దుర్యోధన రెడ్డి మాట్లాడుతూ… ఉద్దానం ప్రాంతంలో రక్తం అందక ఎవరూ కూడా మరణించకూడదని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు.