అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

విజయనగరం: అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం కలక్టరేట్ కూడలి
లో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ లో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు (బాలు) రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ కె.అర్.డి.ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదాతలు ప్రాణాన్ని నిలబెట్టే ప్రాణదాతలని, రక్తాన్ని తయారు చేయలేము గనుకనే స్వచ్ఛందంగా మనకు మనమే రక్తదానం చేయాలని, రాష్ట్రంలో మెగాస్టార్ చిరంజీవి వలన, మెగా ఫ్యామిలీ అభిమానుల వలన రక్తదానం పై ప్రజల్లో అవగాహన బాగా పెరిగిందని అన్నారు. పలువురు రక్తదానం చేసిన ఈ కార్యక్రమంలో అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ కార్యదర్శి కోయ్యాన లక్ష్మణ్ యాదవ్, జనసేన పార్టీ నాయకులు రామచంద్ర రావు,బ్లడ్ బ్యాంక్ డాక్టర్ వేణు గోపాలరెడ్డి, ఎన్.ఎస్.ఎస్. జిల్లా కో ఆర్డినేటర్ శ్రీకాంత్, చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ముడిదాపు రాము, నడక సభ్యులు చాణక్య, అప్పన్న, సాయి తదితరులు పాల్గొన్నారు.