సత్తెనపల్లి జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

  • సత్తెనపల్లి జనసేన ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

సత్తెనపల్లి నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా శుక్రవారం సత్తెనపల్లి పట్టణంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంయుక్త కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు, తిరుమల శెట్టి మల్లేశ్వరి పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటారని అందులో భాగంగానే ఈ రోజున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదానం చేస్తే ఆపదలో ఉన్న ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడొచ్చు అని తెలియజేశారు. ప్రతి వ్యక్తి కూడా రక్తదానంచేసే గుణాన్ని అలవర్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే శనివారం రెండవ తారీకు కూడా జనసేన పార్టీ సత్తెనపల్లి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిరిగిరి మణికంఠ, రాడ్ల శ్రీనివాసరావు, రాజుపాలెం మండలం ఉపాధ్యక్షులు పసుపులేటి వెంకటస్వామి, తిరుమల శెట్టి సాంబ, తిరుమల శెట్టి గోపి, పోతంశెట్టి హరీష్, షేక్ కాజా, మాలపాటి సౌజన్య, తదితరులు పాల్గొన్నారు.