కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కి అండగా బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి నియోజకవర్గం లోని మనుబోలు మండలం, గోవిందరాజుపురం గ్రామంకి చెందిన కంటే ప్రభాకర్ కి రెండు కిడ్నీలు పాడై గత ఆరు నెలల నుంచి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.. ఆ విషయం తెలిసిన వెంటనే బుధవారం వారిని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు కలసి వారి స్థితిగతులు అడిగి తెలుసుకోవడంతో పాటు జనసేన అండగా ఉండి మాకు చేతనైనంత వరకు ఆర్థిక సహాయం అందించడానికి అండగా ఉంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా సురేష్ నాయుడు మాత్లాడుతూ.. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రభుత్వం నుంచి సహకారం ఏమి అందక.. కనీసం రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని కనీసం అలాంటి వ్యవస్థ కూడా పట్టించుకోకపోవడానికి కారణం ఎమిటని ప్రశ్నించారు.

ఈ కార్యక్రమంలో మనుబోలు మండల అధ్యక్షులు పెనుబాక ప్రసాద్, స్థానికులు సుధాకర్, రవికుమార్ శ్రీహరి సందీప్ తదితరులు పాల్గొన్నారు.