స్వామి వివేకానంద, పింగళి వెంకయ్యలకు బొబ్బిలి జనసేన ఘన నివాళులు
బొబ్బిలి నియోజకవర్గం: యువతకి ఆదర్శం శ్రీ స్వామి వివేకానంద వర్ధంతి మరియు భారతదేశ మువ్వేన్నల జెండా రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా మంగళవారం బొబ్బిలి లోని జనసైనికులు నిలయంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు ఆధ్వర్యంలో ఆ ఇద్దరి మహనీయులను తలచుకుంటూ ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బాబు పాలూరు మాట్లాడుతూ.. మన దేశ త్రివర్ణ పతాకం ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటాం ఆయన మన తెలుగు వారు అని, అలాగే యువతకి దిశా నిర్దేశం చేసి యువత ఎదుగుదలకు ఎంతగానో అహర్నిశలు కృషి చేసిన శ్రీ స్వామి వివేకానందల వర్ధంతి సందర్భంగా మహనీయులను తలచుకోవడం సంతోషాన్ని కలిగించింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి నాయకులు లంక రమేష్, సంచాన గంగాధర్, అడబాల నాగు, పల్లెం రాజా, వారణాసివెంకటరమణ, కలిశెట్టి నరేష్, జాన్, పొట్నూరు జగన్, భవర గణేష్ సీతానగరం మండల నాయకులు పోతల శివశంకర్, గణేష్, రామభద్రపురం మండల నాయకులు చీమల సతీష్, తెర్లాం నాయకులు బూరి రామకృష్ణ, ఉమా మహేష్, మోతి దాసు, రాజు, ఎందవ సత్యనారాయణ, జనసేన వీరమహిళలు దివ్య, రమ్య, సత్య, లక్ష్మి, ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-04-at-4.26.54-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-04-at-4.26.54-PM-1-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-04-at-4.26.55-PM-1024x460.jpeg)