చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండించిన బొలిశెట్టి

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: జనసేన కార్యాలయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాయపాటి అరుణ జనసేన పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారూ. ఒక పార్టీ ప్రజా ప్రతినిధిగా చేసిన వ్యక్తిని ఏ విధమైన ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం చాలా దారుణమని అన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన రాజ్యమేలుతుందని ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో వైసిపి నాయకులు తప్ప మరి ఏ పార్టీకిచెందిన వారు కూడా రోడ్డు మీద తిరిగే అవకాశం లేదన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు అరెస్టు విషయంపై అమరావతి పార్టీ ఆఫీస్ కి వస్తున్న సమయంలో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో నిర్బంధించడం చాలా దారుణం. అర్ధరాత్రి అరెస్టులను జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఖండించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ పై వచ్చిన ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్టును జనసేన పార్టీ ఖండిస్తున్నదని పేర్కొన్నారు. మీకు దమ్ముంటే అరెస్టు చేసి చూపించాలి అంతేగాని పిరికిపందలా అర్ధరాత్రి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం చాలా దారుణం అన్నారు. ఆరోపణ ఎదుర్కొన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తే ఈడి అటాచ్మెంట్ జరిగిన ముఖ్యమంత్రిపైన ఎందుకు అరెస్టు చూపించలేదని బొలిశెట్టి ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లండన్ వెళ్లిన ప్రతిసారి రాష్ట్రంలో ఎదో ఒక అరాచకాలు సృష్టించడం ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి మామూలుగా మారింది. ఇటువంటి అక్రమ అరెస్టులను అన్ని పార్టీలు కూడా ఖండిస్తున్నాయని దాన్లో భాగంగా అమరావతి విచ్చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను హైదరాబాద్ ఎయిర్పోర్టులో నిర్బంధించడం దారుణమని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. దీనికి తగిన గుణపాఠం రాబోయే రోజుల్లో ప్రజలు చెబుతారని ఆయన పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశంలో తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ జనసేన పార్టీ నాయకులు, గుండుమొగుల సురేష్, అడబాల నారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి మద్దాల మణి కుమార్, చాపల రమేష్, దంగటి చందు, సోషల్ మీడియా ఇంచార్జ్ ముఖేష్ మరియు జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.