జనసేన ఎందుకు రౌడీ సేననో సీఎం సమాధానం చెప్పాలి?: బొమ్మిడి నాయకర్

నరసాపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ జగన్ మోహన్ రెడ్డి నరసాపురం నియోజకవర్గ పర్యటనలో జనసేన పార్టీ పై ఆయన చేసిన వ్యాఖ్యలను నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు నాయకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి పర్యటనలో లేని నిబంధనలు జగన్ పర్యటనలో అమలుచేసారని, వాలంటీర్లు ప్రజలని భయపెట్టి సభకు తరలించారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టే విష సంస్కృతి స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తీసుకువచ్చారు అని అన్నారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్లను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి గారు వెళ్ళే రోడ్డు మాత్రం అప్పటికప్పుడు మరమ్మత్తులు చేసి వదిలేశారు అని అన్నారు. ప్రతిపక్ష నాయకులను గృహ నిర్భంధం చెయ్యడం ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని తెలియజేస్తుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించి తాము కట్టించినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు అని అన్నారు. మత్స్యకారులు వేట విరామంలో 10 వేలు భృతి తప్ప ఏమీ ఇవ్వడం లేదు అని పేర్కొన్నారు. జనసేన పార్టీ రౌడీ సేన అని ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ పార్టీ లోనే రౌడీలు ఉన్నారని, బూతులు తప్ప వాళ్ళు మాట్లాడేది ఏం ఉండదు అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కౌన్సిలర్ లు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.