జనంలోకి జనసేనలో పాల్గొన్న బొమ్మిడి నాయకర్

నరసాపురం, జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలతో కలిసి సరిపల్లి గ్రామంలో పాదయాత్రగా ప్రతీ గడపకు తిరిగి వారికి జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేసి ఆ గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని వారికి జనసేన పార్టీ తరపున భరోసా ఇచ్చిన నరసాపురం నియోజకవర్గ ఇంచార్జి, పిఏసి సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్. ఆ గ్రామ ప్రజలు ముఖ్యంగా త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు అని నాయకర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి, ఆకన చంద్రశేఖర్, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, వాతడి కనకరాజు, బందెల రవీంద్ర, గుబ్బల మారాజు, తోట నాని, ఒడుగు ఏసు, కొట్టు రామాంజనేయులు, అందే దొరబాబు, కూనపరెడ్డి రామకృష్ణ, పోలిశెట్టి నళిని, వలవల సావిత్రి, ఓలిపల్లి ప్రసాద్, కొండపు హరి, బర్రి అర్జున్, బర్రి దుర్గాప్రసాద్, రాజపు లక్ష్మి నారాయణ, గొర్రెల రాము మరియు నియోజకవర్గ, నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు, సరిపల్లి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.