మొగల్తూరు పంచాయతీ అగ్రహారంలో బొమ్మిడి నాయకర్ పాదయాత్ర

జనంలోకి జనసేన 13వ రోజు

నరసాపురం: జనసేన 13వ రోజు కార్యక్రమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం, మొగల్తూరు పంచాయతీ అగ్రహారంలో నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పిఎసి సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ చైర్మన్ తిరిగి, జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేసి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని జనసేన పార్టీ తరపున భరోసా ఇచ్చారు. ఈ గ్రామంలో ముఖ్యంగా మంచినీటి సమస్య మరియు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని ఆ గ్రామ ప్రజలు తెలిపారని నాయకర్ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి గోపికృష్ణ, వాతాడీ కనకరాజు, నిప్పులేటి తారకరామారావు, గుబ్బల మార్రజు, దూది బాబు, ఉప్పులూరి రాంబాబు, బొక్క చంటి, అయితం చిన్ని, లక్కు బాబి, కడలి త్రిమూర్తులు, దాసరి క్రిష్ణాజి, పోలిశెట్టి నళిని, కొండేటి తాతాజీ, దొంగ సత్యనారాయణ, అడ్డాల ఏడుకొండలు, నల్లి నాగరాజు, పులపర్తి రాంబాబు, మాదిరెడ్డి బాలాజీ, అందే జగదీష్, అందే శివ, కొల్లాటి రాముడు, నక్కా శేఖర్, నంబుల నాగబాబు, కత్తుల కృష్ణ వంశీ మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.