Guntur: ఘనంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బ్రాడీపేట లోనీ మహిళ గడ్డలో జరిగిన జన్మదిన వేడుకలకు జనసైనికులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ బోనబోయిన ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. పార్టీని ముందుకు తీసుకు వెళ్తున్న బోనబోయిన కృషి ఎనలేనిది, పార్టీ శ్రేణులు అందరిని సమన్వయ పరచుకుంటూ జనసేన పార్టీని జిల్లాలో ముందుకు తీసుకెళ్లడంలో బోనబోయిన మంచి ఫలితాలు సాధించారు. గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయడంలో బోనబోయిన కృషి చెప్పుకోదగినది. పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని పటిష్ట పరచడం లో బోనబోయిన తన వంతు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్పొరేటర్లు ఎర్రంశెట్టి పద్మావతి, దాసరి లక్ష్మీ దుర్గ, జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, బిట్రగుంట మల్లిక, జిల్లా ప్రధాన కార్యదర్శులు నారదాసు ప్రసాద్, కొప్పుల కిరణ్, కార్యదర్శులు డెగల లక్ష్మణ్, నక్కల వంశీ, జిల్లా లీగల్ అద్యక్షుడు అమ్మి నాయుడు, రాయల్ సోల్జర్స్ అద్యక్షుడు అన్నదాసు వెంకట సుబ్బారావు, నేతలు ముప్పలనేని సతీష్, పెద్దిబోయిన బాలయ్య, కొద్దిపాటి ప్రసాద్ డొంకేన మురళి, గంధం సురేష్, మిద్దె నాగరాజు, డాక్టర్ చైతన్య, సూరిసెట్రి ఉపేంద్ర, తోట కార్తీక్, బొడ్డేపల్లి రాధ కృష్ణ, మెండు హరి, వంశీ, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.