డా.బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న బొంతు రాజేశ్వరరావు

రాజోలు నియోజకవర్గ పరిధిలోని మామిడికుదురు మండలం మామిడికుదురు ప్రధాన కూడలిలో జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణలో రాజోలు జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొంతు రాజేశ్వరరావు మాట్లాడుతూ డా.బాబూ జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్ అని రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంద కృష్ణ మాదిగ, ఈదరాడా జనసేన నాయకులు ఎరుబండి చిన్ని, స్థానిక ఎమ్.ఆర్.పి.ఎస్ నాయకులు పాల్గొన్నారు.