కౌలు రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి: ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తూ సత్తెనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొన్ని రోజుల క్రితం నిర్వహించిన భారీ బహిరంగ సభలో సరైన వివరాలు లేకపోగా, కొన్ని లోపాల వల్ల బొల్లారం గ్రామం ఎస్సీ కాలనీ కి చెందిన వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందలేదు. ఆ విషయమై బొల్లారం గ్రామం జనసేన పార్టీ అద్యక్షులు కోటా శ్రీనివాసరావు సత్తెనపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు కు తెలియచేయగా వెంటనే వారికి ఆర్ధిక సహాయం అందించి వారి పిల్లల చదువులకు, వారి కుమార్తె వివాహ సమయానికి ఆర్థికంగా తాను సహాయం చేస్తానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి వారి హృదయాలలో ధైర్యాన్ని నింపారు. అంతే కాకుండా ముప్పాళ్ళ మండలం జనసేన అధ్యక్షులు శిరిగిరి పవన్ కుమార్ కూడా మానవత్వంతో ముందుకు వచ్చి ఆ కుటుంబానికి 50 కేజీ ల బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కోట తిలక్ నరికల్ మండలం వైస్ ప్రెసిడెంట్ రఫీ రూరల్, మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు, షేక్ జాన్, పీరా షేక్, సైదా, సురేషు, డేవిడ్, మహేష్ మరియు జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.