మహాపాదయాత్రకు విశేష ఆదరణ

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం ముక్కినాడ గ్రామంలో ఉదృతంగా జరుగుతున్న”జనంకోసం జనసేన – మహాపాదయాత్ర” కార్యక్రమంలో భాగంగా ఆడపడుచులకు బొట్టు పెట్టె కార్యక్రమానికి ప్రజలలో విశేష ఆదరణ లభిస్తుంది. జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పాదయాత్రలో ముందుగా గ్రామంలో ఉన్న బాబు జగజ్జీవన్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రని ప్రారంభించారు. ప్రతీ ఇంటికీ తిరుగుతూ ఆడపడుచులకు అందరికీ బొట్టు పెట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికీ వివరిస్తూ పవన్ రావాలి పాలన మారాలి అనే నినాదంతో ఈసారి పవన్ కళ్యాణ్ కి ఒక్క అవకాశం ఇచ్చి ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలనీ కోరడం జరిగింది. వీరి ప్రచారానికి ప్రజలలో మంచి స్పందన వస్తుంది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.