బత్తుల బలరామకృష్ణని ఘనంగా సన్మానించిన గాయత్రీ బ్రాహ్మణ సంఘం

కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహ గాయత్రి నూతన పాలకవర్గ అధ్యక్షునిగా కొత్తపల్లి భాస్కరరామ్ గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు బత్తుల బలరామకృష్ణ హాజరయ్యారు. నూతనంగా ఎంపికైన భాస్కరరామ్ ను వారి కార్యవర్గాన్ని బలరామకృష్ణ అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అణగారిన వర్గాల్లో బ్రాహ్మణ కుల వృత్తి ఉందని, వారు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఉన్నప్పటికీ ఆర్ధికంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బ్రాహ్మణుల సంక్షేమం కోసం రాజకీయాలకతీతంగా తన శక్తి వంచన లేకుండా బ్రాహ్మణ సమాఖ్యకు సహకారం అందిస్తానని వెల్లడించారు. ఉన్నతమైన సామాజికవర్గంగా గుర్తింపు ఉన్నప్పటికీ బ్రాహ్మణ సంఘం పేదరికంలో ఉండి ఎన్నో కష్టాలు అందిస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా బలరామకృష్ణని గాయత్రీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శాలువాలు కప్పి, పూలదండలు వేసి వేద మంత్రోచ్ఛారణతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, బ్రాహ్మణ సమాఖ్య నాయకులు పాల్గొన్నారు.