నేటి నుంచి యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదాద్రిలో నేటి నుంచి శ్రీలక్ష్మినరసింహస్వామి వార్షిక బ్రహ్మొత్సవాలు ప్రారంభం కానున్నాయి. 11 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలు ఈ నెల 25న ముగుస్తాయి. 16న ధ్వజారోహణం, 21న స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం, 22న ఉదయం 11 గంటలలకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. స్వయంభూ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నందున కరోనా నిబంధనలను పాటిస్తూ బాలాలయంలోనే బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఎత్తివేశాక ఉత్సవాలకు హాజరయ్యే ముఖ్యుల వివరాలు ఫైనల్‌ కానున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ముస్తాబు చేశారు. విద్యుద్దీపాల అలంకరణతో స్వామి వెలిసిన కొండను తీర్చిదిద్దారు.