వేదాస్ వృద్ధాశ్రమంలో అల్పాహార పంపిణీ కార్యక్రమం
ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవాసమితి అధ్యక్షుడు రాహుల్ సాగర్ ఆధ్వర్యంలో ప్రతివారం అల్పాహారం అన్నదానం కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక వేదాస్ వృద్ధాశ్రమం నందు సుమారు 30 మంది వృద్ధులకు అనాధ పిల్లలకు అల్పాహార పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ సాగర్ మాట్లాడుతూ సేవా కార్యక్రమం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, తమకు తోచిన విధంగా మూడు వారాలుగా అల్పాహారం అన్నదానం కార్యక్రమం చేస్తున్నామని, రాబోయే రోజులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రషీద్, రామ్, శివ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-24-at-9.56.18-PM-1024x576.jpeg)