పగిలిన వాటర్ పైప్ లైన్ వెంటనే మరమ్మతులు చేపట్టాలి: నూజివీడు జనసేన

నూజివీడు టౌన్ లో ఒకటవ వార్డ్ ఏం.ఆర్.అప్పారావు కాలనీలో పగిలిన వాటర్ పైప్ లైన్ వెంటనే మరమ్మతులు చేపట్టాలనీ నూజివీడు నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు మరీదు శివరామకృష్ణ డిమాండ్ చేశారు. స్థానిక జనసైనికులతో కలిసి సెంటున్నర ఒకటో రోడ్డు వద్ద పైప్ లైన్ పగిలి వాటర్ పోతూ ప్రజలు ఇబ్బంది పెడుతున్న స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ 4 నెలలుగా కాలనీకి వచ్చే కృష్ణ వాటర్ పైప్ లైన్ పగిలి నీరు పోతుంటే స్థానిక కౌన్సిలర్, నూజివీడు మునిసిపల్ సిబ్బంది పట్టించుకోకుండా ఉండటం బాధాకరమన్నారు. స్థానిక ప్రజలు సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకు వెళితే ప్రజలు తలో 500 వేసుకొని పైప్ లైన్ మరమ్మతులు చేయించుకోవాలని ఉచిత సలహా ఇవ్వటం బాధ్యత రాహిత్యానికి నిదర్శనమన్నారు. ప్రజలు నాలుగు నెలలుగా బురదమయం అయిన ఆ రోడ్లో నడవలేక ఇబ్బందులు పడుతున్న ప్రజా ప్రతినిధి, అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడం పేదలు నివసించే ప్రాంతాలపై మీకున్న పక్షపాత వైఖరి తెలియజేస్తున్నారు. వెంటనే పైప్ లైన్ మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరించకుంటే మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నూజివీడు టౌన్ నాయకులు ఏనుగుల చక్రి, ముత్యాల కామేష్, స్థానిక నాయకులు శ్రీకాంత్, ఆలీ భాషా, గిరి, దినేష్, సాయి, మణికంఠ, మహేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.