బాలుడి గుండె చికిత్స కోసం జనసేన రెండు లక్షలు ఆర్థిక సాయం

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మదనాపురం గ్రామానికి చెందిన సాద జశ్వంత్ అనే ఏడేళ్ళ బాలుడి గుండె శస్త్ర చికిత్స చికిత్స కోసం రూ.2 లక్షలు జనసేన పార్టీ ఆర్థిక సాయం అందచేసింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ బాలుడు తల్లితండ్రులకు చెక్ అందచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీ గేదెల చైతన్య పాల్గొన్నారు.