క్యాన్సర్ పేషంట్ కి ఆర్థిక సాయం చేసిన బి.ఆర్.ఎస్ చారిటబుల్ ట్రస్ట్

ఆత్మకూరు, బి.ఆర్.ఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆత్మకూరుకి చెందిన ఖాజా మస్తాన్ అనే వ్యక్తికి ఆర్ధిక సాయంగా 5000 రూపాయలని ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాస్ భరత్, ట్రెజరీ సునీల్ యాదవ్ అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు నాగరాజు యాదవ్, నియోజకవర్గ నాయకులు వంశీ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్న ఖాజా మస్తాన్ ని దాతలు ఆదుకోవాలని, ఆయనకి వచ్చే పెన్షన్ మీదే ఆధారపడి కుటుంబం బతుకుతుందని, భార్య ఉపాధి లేక, కూతురు ఎం.ఎల్.టి ట్రైనింగ్ చేస్తూ ఈ కుటుంబం కష్టాల్లో ఉందని వీరిని స్వచ్ఛంద సేవా సంస్థలు ఆదుకోవాలని ఈ సందర్భంగా శ్రీనివాస్ భరత్ తెలియచేశారు.