వైసీపీ నాయకులు 3డి (దోపిడీ, దౌర్జన్యం, దగా) చూపిస్తున్నారు: చెన్నారెడ్డి మనుక్రాంత్

నెల్లూరు రూరల్ కల్లూరు పల్లి, 25 వ డివిజన్ జనసేన కార్యకర్త రమణ పిలుపుమేరకు డివిజన్ కు విచ్చేసిన జనసేన జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ కి స్థానికులు సమస్యలను వివరించారు. సమస్యలను నెల్లూరు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని స్థానిక నాయకుడు రమణ ఆధ్వర్యంలో మీరు అందరూ ముందుకు వస్తే కమిషనర్ ని కలిసి స్థానిక సమస్యల గురించి వివరించి వాటి పరిష్కారానికి జనసేన పార్టీ తరఫున పోరాడుతామని తెలియజేశారు. కార్పొరేషన్ లిమిటెడ్లో ఉన్నప్పటికీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని పడితే రోడ్లు పోతున్నాయని డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక రోడ్లపై డ్రైనేజ్ వాటర్ వదిలేయడం వల్ల పరిసరాలను అని తమను పట్టించుకునే నాధుడే లేదని ఓట్లు మాత్రం వచ్చి తిరిగి ఓట్లు వేయించుకున్న నాయకులు సమస్యల కార్పొరేషన్ పరిధిలో ఉన్నా తమ సమస్యలను గురించి పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. తమ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తెలిపారు.