ముందు రోడ్లు వేయండి అప్పుడు పథకాల గురించి మాట్లాడండి: సుభాని

ఆత్మకూరు, జనసేన పార్టీ వింజమూరు మండలం ఉపాధ్యక్షులు షేక్ సుభాని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి నా చిన్న విన్నపం అయ్యా ముఖ్యమంత్రి గారు ముందుగా మీరు చేయాల్సింది పథకాల గురించి కాదు ముందు రోడ్లు వేయండి అయ్యా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందుగా ఉదయగిరి నియోజకవర్గంలో ఆత్మకూరు నియోజకవర్గంలో రోడ్లు చాలా దారుణంగా తయారయ్యాయీ వింజమూరు నుంచి ఆత్మకూరుకి వెళ్ళాలంటే అతి దారుణంగా ఉన్నాయి రోడ్లు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు గర్భిణీ స్త్రీలైతే ఆత్మకూరు హాస్పిటల్ కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ఆ రోడ్డును వేయాలాచినదిగా కోరుకుంటున్నామని మీరు ముందు పథకాలు గురించి కాదు అయ్యా ముఖ్యమంత్రి ముందు రోడ్లు వేయండి అప్పుడు పథకాల గురించి మాట్లాడండి ఒక్కవేళ మీరు వింజమూరు నుండి ఆత్మకూరు రోడ్డు వేయకపోతే మేము జనసేన పార్టీ తరుపున ప్రజల తరుపున పెద్ద ఎత్తున ధర్నాలకు దిగుతాం అని సుభాని తెలియజేసారు.