మోటురి దంపతుల ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రేట్ నందు ప్రతి సంవత్సరం వేసవికాలంలో ఏర్పాటుచేసే విధంగా సోమవారం చిందాడగరువు ఎం.పి.టి.సి మోటురి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులచే స్పందన కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలకు ఈ దంపతులు ముందుకు రావడం ఆనందనీయమని మోటురి దంపతులను అభినందించారు. జాయిట్ కలెక్టర్ ధ్యాన్ చంద్ర, సత్తిబాబు, జిల్లా పంచాయతీ రాజ్ ఉద్యోగుల అధ్యక్షులు ఆర్ ఎస్ రాజు, వివిధ జిల్లా అధికారులు, పలువురు పత్రిక సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు పాల్గొన్నారు.