పదవతరగతి విద్యార్ధులకు మజ్జిగ పంపిణీ

గాజువాక నియోజకవర్గం, 64 వ వార్డు గంగవరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు, గంగవరం జనసేన నాయకులు, జనసైనికుల ఆధ్వర్యంలో విద్యార్థులకు మరియు స్కూల్ స్టాఫ్ అందరికీ బటర్ మిల్క్ ప్యాకెట్స్ అందజేయడం జరిగింది. హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ప్రియాంక రెడ్డి మరియు స్కూల్ సిబ్బంది, గంగవరం గ్రామ జనసేన నాయకులను, జనసైనికులను మంచి కార్యక్రమం చేశారని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నం జిల్లా పార్లమెంటు మాజీ అధికార ప్రతినిధి సిహెచ్ ముసలయ్య ఆర్గనైజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎరి పిల్లి మెగా నూకరాజు, సిహెచ్ ధనరాజు, పేర్ల అప్పన్న, బడి రాజు, పి నూకరాజు, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.