కోవెలకుంట్ల జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

కోవెలకుంట్ల, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కోవెలకుంట్లలోని సంత మార్కెట్ లొ డొక్కా సీతమ్మ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని జనసేన నాయకులు పత్తి సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తి సురేష్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ స్థాపించినప్పటినుండి పవన్ కళ్యాణ్ గారి సామాజిక సేవల స్ఫూర్తితో ఇసుక కొరతతో ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం, చలికాలంలో చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న పేదలకు దుప్పట్ల పంపిణీ, కరోనా సమయంలో విలేకరులకు మరియు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ వంటి పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అందులో భాగంగా వేసవి కాలం కావడంతో ఎండల తీవ్రత నుండి ప్రజలకు ఉపశమనం కోసం తమ వంతు సహాయంగా శుక్ర వారం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. గురప్ప, బోధనం ఓబులేసు, చెన్న కిట్టు, లింగమయ్య, పొట్టిపాడు భాష, సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పత్తి సురేష్ తెలిపారు.