ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు ఎపి క్యాబినెట్ ఆమోదం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికిగాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో.. గవర్నర్కు ఎపి సర్కార్ ఆర్డినెన్స్ను పంపనుంది. మూడు నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను రూ.90 వేల కోట్ల అంచనాలతో రూపొందించారు. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా బడ్జెట్ సమావేశాలను నిర్వహించని విషయం తెలిసిందే.