క్వ‌శ్చ‌న్ అవ‌ర్‌ ర‌ద్దు

ఈ నెల 14 నుంచి అక్టోబరు 1 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. అయితే కరోనావైరస్ కారణంగా ఈ సారి సమావేశాల కోసం ప్రత్యేక ఏర్పాట్లతోపాటు.. సభ్యులకు పలు షరతులు కూడా విధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు ఉభయసభల అధికారులు. సమావేశాలు ప్రారంభమయ్యే 72 గంటల ముందు సభ్యులు, అధికారులు, జర్నలిస్టులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఈ 15 రోజుల కాలంలో సెలవులు కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే.. తాజాగా ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యాన్ని కూడా ఎత్తివేస్తున్న‌ట్లు రాజ్య‌స‌భ సెక్ర‌టేరియేట్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ప్రైవేటు మెంబ‌ర్స్ బిజినెస్ ఉండ‌దని.. కేవ‌లం 30 నిమిషాలు మాత్ర‌మే జీరో అవ‌ర్ ఉంటుందని పేర్కొన్నారు. సాధార‌ణంగా స‌భ ప్రారంభం కాగానే ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యం ఉంటుంది. కానీ ఈసారి ఆ క్వ‌శ్చ‌న్ అవ‌ర్‌ను ర‌ద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.