నిరుద్యోగుల గోడు వినిపించదా..? జిల్లా నాయకులు భరత్

ఆత్మకూర్, యువత చదువుకుని ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా తిరుగుతున్నారని జిల్లా నాయకులు భరత్ అన్నారు. ఆయన మాట్లాడుతూ… నిరుద్యోగ యువతకి సబ్సిడీ లోన్ లు, పారిశ్రామిక వేత్తల కింద లోన్ లు, ప్రోత్సాహకాలు సరిగా ఇవ్వడంలేదని, అందువల్ల యువత విదేశాలకు వలస పోతున్నారని, ఎంబిఏ చదివిన వారు కూడా టీ కొట్లు, పండ్ల దుకాణాలు పెట్టుకుని గిట్టుబాటు కాక అప్పులు పాలు అవుతున్నారని, ఈ దయనీయ పరిస్థితిని ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నిరుద్యోగులని ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప వారి సమస్యలని పరిష్కరించడం లేదని,జనసేన వస్తే నిరుద్యోగులకు వ్యాపారవకాశాలని కల్పిస్తాం అని ఈ సందర్భంగా భరత్ తెలియ చేశారు.