‘క్యాచ్ ది రెయిన్’ వర్షం నీటిని ఒడిసి పడదాం: మోదీ

వేసవి సమీపిస్తున్న తరుణంలో నీటి సంరక్షణపై దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. త్వరలోనే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ‘క్యాచ్ ది రెయిన్’ ప్రచారానికి శ్రీకారం చుట్టనుందని ప్రకటించారు. నెలవారీ రేడియా కార్యక్రంలో భాగంగా 74వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో జాతినుద్దేశించి ప్రధాని ఆదివారంనాడు మాట్లాడారు. నీటి సంరక్షణ, ఆత్మనిర్భర్ భారత్ సహా పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. మాఘమాసంలోనే హరిద్వార్ కుంభమేళా జరుపుకుంటున్నామని, మార్చి 22న నీటి దినోత్సవాన్ని జరుపుకుంటామని గుర్తుచేశారు.

తమిళం నేర్చుకోలేకపోయా..

ఏదైనా చేయాలనుకున్నది మీరు చేయలేకపోయారా అని వ్యక్తి కొద్దిరోజుల క్రితం తనను అడిగాడని, దానికి తనను తాను ప్రశ్నించకున్నానని మోదీ చెప్పారు. ప్రపంచంలోనే అతి పురాతమైన తమిళ భాష నేర్చుకునేందుకు తగిన ప్రయత్నం చేయలేకపోవడం తనను బాధించిన విషయమని అన్నారు.