నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొన్న సిజి రాజశేఖర్

పత్తికొండ: ఇంటర్ పూర్తి చేసుకుని ఉన్నత చదువులకు వెళ్ళాలి అనుకునే విద్యార్ధినుల కోసం కలలకు రెక్కలు ‘కలలకు రెక్కలు’ అనే కార్యక్రమాన్ని నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రొఫెషనల్ కోర్స్ లు నేర్చుకునే విద్యార్ధినులకు ప్రభుత్వ గ్యారెంటీతో బ్యాంక్ రుణాలు, విద్యార్థినులు బ్యాంక్ నుంచి పొందే రుణాలకు వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లించేలా కార్యక్రమం రూపొందించబడింది. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ప్రత్తికొండ పర్యటనలో కొత్త కార్యక్రమాన్ని ప్రకటించిన నారా భువనేశ్వరీ. టీడీపీ – జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత ఉమ్మడి ప్రభుత్వంలో కలలకు రెక్కలు కార్యక్రమం ప్రారంభం అవుతుంది అని భువనేశ్వరి తెలిపారు.