వైసీపీ ప్రభుత్వం విద్యకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు: ముత్తా శశిధర్

కాకినాడ, జనసేన పిఏసి సభ్యుడు కాకినాడ జనసేన ఇంచార్జ్ ముత్తా శశిధర్ మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వం విద్యకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అమ్మఒడి డబ్బులు ఎవరికి పడవని జనసేన ముందుగానే చెప్పింది. వైసీపీ నేతలు భూములు కబ్జా చేస్తున్నారు. ఈ విషయంపై అవసరమైతే కోర్టుకు వెళ్తాము. దసరా నుంచి జనసేన దండయాత్ర మొదలవుతుంది. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని వర్గాలను ఈ ప్రభుత్వం మోసం చేసింది. బడుగు బలహీన వర్గాల తరపున పోరాడడానికి జనసేన ఎప్పుడు ముందుంటుందని అన్నారు.