ఛలో రణస్థలం: డా. యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు: ఛలో రణస్థలం.. యువశక్తి  కార్యక్రమానికి యువతరానికి జనసేన నాయకులు డా. యుగంధర్ పొన్న ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ గళాన్ని వినిపించే అవకాశం ఛలో రణస్థలం జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం రోజున, స్వామి వివేకానంద వేదికపై జనసేన యువశక్తి ద్వారా మీ ప్రాంత సమస్యలపై గళం వినిపించండి. మీ 25 ఏళ్ల భవిష్యత్తు కోసం పోరాడుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వం లో జరుగుతున్న యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని డా. యుగంధర్ కోరారు.