జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన జనసేన

తిరుపతి, జ్యోతిరావు పూలే మహనీయుని 195 వ జయంతిని పురస్కరించుకొని తిరుపతి జనసేన పార్టీ తరపున స్థానిక బాలాజీ కాలనీ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వారికి ఘననివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజా రెడ్డి మాట్లాడుతూ… ఆదర్శప్రాయుడు, ప్రధమ సామాజిక తత్వవేత్త, సమన్యాయ సత్య శోధకుడు, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన ఉద్యమకారుడు సంఘసేవకుడు జ్యోతిరావు పూలే గారు ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని ఆ మహనీయుడుని స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బాబ్జి, ప్రధాన కార్యదర్శులు సుమన్ బాబు, మునస్వామి మరియు న్యాయవాది ముక్కు సత్యవంతుడు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.