Echcherla: ఛలో విశాఖ అంటూ పోస్టర్ విడుదల చేసిన ఎచ్చెర్ల జనసేన నేతలు

విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఈ నెల 31న నిర్వహించనున్న సంఘీభావ సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఉత్తరాంధ్రను మరింత వెనుకబాటుకు నెట్టే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందంటూ జనసేన శ్రేణులు ప్రజలను సమాయత్తం చేస్తున్నాయి. ఛలో విశాఖపట్నం అంటూ గోడ పత్రికలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గ కేంద్రంలో జనసేన నాయకులరాలు శ్రీమతి కాంతి శ్రీ అందుకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.